ఆషాఢ మాసం బోనాలు ఆదివారం చారిత్రక
గోల్కొండకోటనుంచి ప్రారంభం
కానున్నాయి. దీనికి లంగర్హౌస్ చౌరస్తాలో రాష్ట్ర
ప్రభుత్వం తరపున
అంకురార్పణ జరుగనున్నది. గోల్కొండ కోటపై ఉన్న
జగదాంబిక ఆలయం
నుంచే రాష్ట్రంలో బోనాలు ప్రారంభం కావడం
సంప్రదాయంగా వస్తున్నది.
మొదటి పూజ ఆదివారం మధ్యాహ్నం లంగర్హౌస్లో
ప్రారంభం కానున్నది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్రావు
ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని నిర్వాహకులు తెలిపారు.
లంగర్హౌస్ చౌరస్తాలో
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలను
అందజేస్తారని కార్వాన్
నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి జీవన్సింగ్, రాష్ట్ర
నాయకులు కావూరి
వెంకటేష్ తెలిపారు.

Post a Comment